Thursday, 1 September 2016

మీ కోసం ...!!


 పెరుగు తినటం వల్ల 

చలికాలంలో సాయంకాలం పెరుగు తినటం వలన కఫము పెరుగుతుందనో లేక మరేదైనా సమస్య రావచ్చని చాలామంది భావిస్తారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
        అయితే అప్పటికే ముక్కు కారటం, గోంతు ఛాతిలో కఫము ఉండటం వలన చల్లని పాలు లేదా పెరుగు తీసుకుంటే కొంతవరకు సమస్య పెరగవచ్చునేమో కానీ కొత్తగా అయితే సమస్య రాదు.
        వృత్తి, ఉద్యోగాలలో ఎక్కువ మాట్లాడాల్సి ఉంటే వారు కొంత జాగ్రత్త తీసుకోవాలి.
        ముందు జాగ్రత్తగా సాయంత్రం వేళ చల్లగా ఉండేవాటినో లేదా సిట్రస్ ఫ్లేవర్ గల పానీయాలను తాగకూడదు. సూప్స్,   గ్రీన్ టీ వంటి వెచ్చని పానీయాలు తాగితే రిలీఫ్ గా ఉంటుంది.

తాజాగా ఉండాలి అంటే !!!

కూరగాయలన్నిటిని తెచ్చి తేవగానే ఫ్రిజ్ లో సర్దేయకూడదు. టొమోటోలు,  బంగాళదుంపలు, స్క్వాష్, సిట్రస్ పండ్లు చల్లని  కౌంటరు టాప్ ల పై ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. వాటిని భద్రపరచటానికి  ముందు వాష్ చెయ్యకూడదు. లూజ్ గా రోల్ చేసి ప్లాస్టిక్  బ్యాగ్స్ లో పెట్టాలి కొద్దిగా ఆలివ్ ఆయులు రాయటం వల్ల కూరగాయలు పాడవవు .  రెండు మూడు రోజుల్లో వాడేస్తామనుకుంటే పండ్లను ఫ్రీజ్ లో భద్రపరచాల్సిన అవసరం అంతగా ఉండదు.

No comments:

Post a Comment